హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ..హుస్నాబాద్‌లో బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. నగరంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పట్టణంలో ఇండోర్‌ స్టేడియం, డిగ్రీ కాలేజీ, ఎస్టీ బాలికల హాస్టల్‌ ప్రారంభించారు. లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీశ్‌ పాల్గొన్నారు. మరికాసేపట్లో హుస్నాబాద్‌ నుంచి హన్మకొండ కు బయలుదేరారనున్నారు.

హన్మకొండ లో రూ.181 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన మాడల్‌ వైకుంఠధామం, సైన్స్‌ పార్‌లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్‌ సైన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.128 కోట్లతో 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హసన్‌పర్తి కిట్స్‌ కాలేజీలో ఇన్నోవేషన్‌ హబ్‌ను, సాయంత్రం 4.30 గంటలకు హన్మకొండ లో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కాజీపేటలోని సెయింట్‌ గ్యాబ్రియల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.