పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు-కేటీఆర్

హైదరాబాద్ లోని పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈరోజు అంబేద్కర్‌ జ‌యంతి సంద‌ర్భంగా పంజాగుట్ట కూడ‌లిలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంద‌న్నారు.

సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్ కు సాధ్యమని అన్నారు. దేశంలోనే అతిపెద్దదైన ఆయన విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం సాహసోపేతమైనదని కేసీఆర్ వెల్లడించారు. పార్లమెంట్ కు కూడా అంబెద్కర్ పేరు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడ‌లికి అంబేద్క‌ర్ పేరు పెడుతామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, మ‌హ‌ముద్ అలీ, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు, నాయ‌కులు పాల్గొన్నారు.