విగ్రహా అవీష్కరణ సందర్భంగా తరలి వస్తున్నా అభిమానులు
కాసేపట్లో కెసిఆర్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ
హైదరాబాద్ః అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లలో కోలాహలం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దారులన్నీ అంబేడ్కర్ విగ్రహం వైపే. తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి వేలాది గా తరలివస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దారి పొడవునా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో.. ఎవరు అస్వస్థత కి గురైనా ఇబ్బంది పడకుండా మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేశారు.
కాగా, భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నేడు ఆవిష్కరణకు సిద్ధమైంది. ఆ సమసమాజమూర్తి మహా విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరికాసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు. ట్యాంక్బండ్ దగ్గరకి ర్యాలీగా జనం తరలివస్తున్నారు. కాసేపట్లో కెసిఆర్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది.