చందానగర్ లో పట్టపగలు దారుణం..

చందానగర్ లో పట్టపగలు దారుణం జరిగింది. భార్య ను అతి కిరాతకంగా చంపేశాడు భర్త. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో ఓ బొటిక్ జరిగింది. గత కొద్దీ నెలలుగా బొటిక్ లో అంబిక (27) అనే మహిళ పని చేస్తూ ఉంది. ఈమెకు పెళ్లయ్యి భర్త, కుమార్తె ఉన్నారు. ఏడాది కాలంగా భర్త నరేందర్ తో గొడవలు జరుగుతున్నాయి. బొటిక్ లో పని చేయటం మానేయాలంటూ భర్త ను ఆమెను ఒత్తిడి తెస్తున్నాడు. కానీ ఆమె మాత్రం ఉద్యోగం మానేసిది లేదని స్పష్టం చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలోనే శుక్రవారం భర్త బొటిక్ దగ్గరకు వచ్చాడు. వీరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటమాటా పెరిగి.. భార్య అంబికను.. బొటిక్ ఆఫీసులోనే బండ రాయితో కొట్టి చంపాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది అంబిక. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నరేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. అంబికపై అనుమానంతోనే.. భర్త నరేందర్ ఈ హత్య చేశాడని ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు.