పారిశుద్ధ్య కార్మికుల‌తో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకున్న కెటిఆర్‌

KTR celebrates New Year with ghmc sanitation workers

హైద‌రాబాద్ : బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను పారిశుద్ధ్య కార్మికుల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో కెటిఆర్ పారిశుద్ధ్య కార్మికుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. వారితో కాసేపు ముచ్చ‌టించిన కెటిఆర్.. అనంత‌రం క‌లిసి భోజ‌నం చేశారు. కార్మికుల‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. ఇక కెటిఆర్‌ను ప‌లువురు బిఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.