ట్యాంక్‌బండ్‌పై లేజర్‌ షో .కేటీఆర్ కీలక నిర్ణయం

ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 నుండి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించేలా నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని నగరవాసుల్లో ఆనందం నింపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ ఆదివారం సాయంత్రం కొత్త శోభ సంతరించుకుంది. ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రణగొణగా ఉండే హుస్సేన్ సాగర్.,.గత రెండు వారాలుగా ఆదివారం సాయంత్రం చాల ప్రశాంతంగా ఉంటుంది. నగరవాసులు తమ కుటుంబ సభ్యులతో ట్యాంక్‌బండ్‌ తిరుగుతూ అందాలను ఆస్వాదిస్తున్నారు. దీని తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో కేటీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్‌ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని వైపుల నుంచి వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. హస్తకళలు, సంగీతం, కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. స్పెషల్‌ సీఎస్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ వెంటనే స్పందించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.