వైస్సార్సీపీ పై బోండా ఉమా విమర్శలు

అమరావతి : టీడీపీ నేత బోండా ఉమా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రూ అప్ పేరిట కరెంట్ ఛార్జీలు రెట్టింపు చేశారన్నారు. వైస్సార్సీపీ కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెరిగాయని విమర్శించారు. ఛార్జీలు తగ్గించకపోతే.. మహిళలే వైస్సార్సీపీ నేతలను చీపుర్లతో తరిమికొడతారని హెచ్చరించారు.

పదవి కోసం మంత్రి వెల్లంపల్లి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. వెల్లంపల్లి మంత్రి పదవి రెండు నెలల్లో ఊడిపోతుందని అన్నారు. వైఎస్ వర్థంతికి అడ్డురాని కరోనా నిబంధనలు.. గణేష్ ఉత్సవాలకు అడ్డువస్తాయా అని ప్రశ్నించారు. ఏం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని బోండా ఉమ పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/