ఎమ్మెల్యే అరూరి రమేష్ కు షాక్ ఇచ్చిన కొత్తపల్లి గ్రామస్థులు

టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ కు షాక్ తగిలింది. కొత్తపల్లి గ్రామంలో కొత్త పెన్షన్ కార్డులు అందజేయగా.. తాము అప్లై చేసుకున్నా రాలేదని , గ్రామం నుంచి ఇల్లంద వెళ్లే రూట్​లో బ్రిడ్జి పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు. గతంలో చేసిన శంకుస్థాపనలే అలాగే ఉన్నాయని..ఇంతవరకు పనులు మొదలుకాలేదని , ఇప్పుడు కొత్తగా శంకుస్థాపనలు చేసి ఏంలాభం అన్నట్లు గ్రామస్థులు వాపోయారు.

అలాగే ల్యాబర్తి గ్రామంలోనూ అర్హులకు పెన్షన్లు అందలేదని కొణతమంది ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించగా.. రూ.3లక్షలు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అనంతరం బొక్కలగూడెం, చంద్రు తండా, రాంధన్ తండాల్లో పర్యటించి పెన్షన్ కార్డులు అందజేశారు. మండలవ్యాప్తంగా మొత్తం 251మందికి కొత్తగా పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో రూ.1.80కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు, శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు.