మాణిక్​రావు ఠాక్రేను కలిసిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ..పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్​రావు ఠాక్రేను బుధువారం కలిశారు. రెండు రోజుల హైదరాబాద్ పర్యటన నిమిత్తం మాణిక్​రావు ఠాక్రే హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బుధువారం హైదరాబాద్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో మాణిక్​రావు ఠాక్రేను వెంకట్ రెడ్డి కలిశారు. ​ఎస్​తో పొత్తు, రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఠాక్రేకు వివరణ ఇవ్వడం జరిగింది.

అనంతరం మీడియాతో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఠాక్రేతో అనేక విషయాలు చర్చించాను అని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏం చేయాలనే దానిపై చర్చించాం. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని చెప్పాను. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని కోరాను. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పాను. ఇంకొంచెం కష్టపడితే 60 సీట్లు వస్తాయని చెప్పాను. పార్టీని గెలిపించే విషయంపై చాలాసేపు చర్చించాం. టికెట్లు, పొత్తులు, అభ్యర్థులు, సర్వేల గురించి మాట్లాడామని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పుకొచ్చారు.