బాలకృష్ణ , చంద్రబాబు లపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. వైస్సార్సీపీ – టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ నేతలు టీడీపీ కి సపోర్ట్ చేయడం..ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం..ఆ తర్వాత వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది టీడీపీ తో టచ్ లో ఉన్నారంటూ బాలకృష్ణ తో పాటు పలువురు టీడీపీ నేతలు చెప్పడం తో ఎవరై ఉంటారా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..టీడీపీ వారి మాటల ఫై కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నా… జగన్‌కు వచ్చే నష్టమేమీ లేదన్న నాని.. ఎన్నికల వేళ లీడర్లెవరైనా.. ప్రజలతో టచ్‌లో ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

2019లో జగన్ చేతిలో అల్లుళ్లకు పట్టిన గతే.. బావ చంద్రబాబు, బావమరిది బాలయ్యలకు పడుతుందన్నారు. వై నాట్ అంటున్న నందమూరి బాలయ్య కు.. ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చూపిస్తారన్నారు. నందమూరి బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్లను ఇంటికి పంపించినట్లే.. ఇటు బావ, బావమరుదులైన బాలయ్య, చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతారన్నారు. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ అంటున్నారని.. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ సీట్లు ఇవ్వరన్నారు. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తారన్నారు.
.