ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని

వైస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని ఆర్టీసీ ఫైర్ బస్సును నడిపారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు హైర్ బస్సులను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. కొడాలి నాని చేతుల మీదుగా ఈ బస్సులను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే కొడాలి నాని సందడి చేశారు. నాని బస్ నడపడం చూసి స్థానికులు , కార్య కర్తలు ఆశ్చర్య పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నూతన సర్వీసులు గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. ఈ బస్సులు S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోడలి నాని మాట్లాడుతూ.. దళిత వర్గాల శ్రేయస్సుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు, ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం సంతోషం గా ఉందన్నారు.