బిజెపి కండువా కప్పుకున్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ సోదరుడు

తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని బిజెపి భారీ ఎత్తున కసరత్తులు చేస్తుంది. అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నేతలపై కన్నేసింది. అధిష్టానాలపై కాస్త అసమ్మతిగా ఉన్న నేతలను తమ పార్టీ లోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ , బిఆర్ఎస్ నేతలు కమలం గూటికి చేరగా..తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ సోదరుడు రాంచందర్ బీజేపీ కండువా కప్పుకున్నారు.

కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఆధ్వర్యంలో రాంచందర్ బీజేపీ కండువా కప్పుకొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బుధవారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రూపాలా మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోడీ మరింత పెంచుతున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలు మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బీజేపీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన ఆయన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.