కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కిషన్ రెడ్డి సమావేశం ..!

kishan-reddy-meet-union-home-minister-amit-shah

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులు, మోడీ సభపై చర్చ.. బిజెపి తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచన చేస్తోంది. నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు ఉండే అవకాశం కనిపిస్తోంది. రేపు మరోసారి తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ.. నిజామాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

నిన్న పాలమూరు పర్యటనలో వరాల జల్లు కురిపించిన మోడీ. రేపు మరోసారి ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. సిద్దిపేట-సికింద్రాబాద్ రైలును ప్రారంభించనున్నారు ప్రధాని. మరోవైపు తెలంగాణ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన చేయనున్నారు. అక్టోబర్ రెండోవారంలో బిజెపి మొదటి లిస్ట్ విడుదల చేయనుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను కేటాయించారు. మరికొన్ని నియోజకవర్గాలకు కేటాయించాల్సి ఉంది.