ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ సీఎం కేసీఆరే: మంత్రి హరీశ్ రావు

harish-rao-comments-on-opposition-parties

సిద్దిపేట : దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రామలింగారెడ్డి విగ్ర‌హాన్ని త‌న‌ చేతుల మీదుగా ఆవిష్కరిస్తానని ఊహించలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేద‌న్నారు. రామలింగారెడ్డి అంటే వైవిధ్యాల సమ్మేళనం అని పేర్కొన్నారు. గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి ఆయ‌న‌.. అందరి కంటే భిన్నంగా ఉండేవారని మంత్రి గుర్తు చేశారు. రామలింగారెడ్డి ఆత్మ శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరాలన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో జోడెడ్లుగా రామలింగారెడ్డి తాను కలిసి పని చేశాం. మానుకోట, మనోహరాబాద్ రైల్వే రోకో, హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా, రాస్తారోకో, నిరసనలు, 48 గంటలు నిద్రాహారాలు మానుకుని చేసిన జ్ఞాపకాలను హ‌రీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం లెక్క చేయకుండా పని చేసి లింగ‌న్న ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ ముఖ్య‌మంత్రి కేసీఆరే అని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో బిజెపి లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు అని మంత్రి తేల్చిచెప్పారు.

రామలింగారెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రిబ్బన్ కట్ చేస్తున్నారని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక మూడేళ్లలో చేసిందేమీ లేదు. కానీ, చీరలు, సారెలు ఇస్తుండట. బిజెపి రఘునందన్ రావు మాయ మాటలు నమ్మి సోలిపేట సుజాత అక్కకు అన్యాయం చేశారు. రఘునందన్ అరచేతిలో వైకుంఠం చూపితే దుబ్బాక ప్రజలుగా నమ్మి మోసపోయాం. ఈ ఎన్నికల్లో మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. సోలిపేట కుటుంబానికి అండగా ఉంటా.. రాజకీయంగా నిలబెడతాన‌ని మంత్రి హరీశ్ రావు స్ప‌ష్టం చేశారు.