‘వెల్లంపల్లి’ నోరు అదుపులో పెట్టుకో.
తెదేపా ఎమ్మెల్సీ ‘మంతెన’ మండిపాటు
Amaravati: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు.
ఆదివారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు.. మాజీ సిఎంచంద్రబపై, అశోక్గజపతిరాజులపై మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని డిమాండ్చేశారు..
పేదల అభ్యున్నతికి రూ.14 లక్షలకోట్లు విలువచేసే ఆస్తులను దానం చేసిన అశోక్ గజపతిరాజును మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు..
వెల్లంపల్లి వంటి వ్యక్తి దేవాదాయశాఖ మంత్రిని చేశారని, అందుకు ఆ భగవంతుడు కూడ బాధపడుతున్నాడని అన్నారు.. రాష్ట్రంలో 125 ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరినీ కూడ ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు.
.వెల్లంపల్లి మంత్రి అయ్యాక వేలాది ఎకరాల మాన్యం భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/