తెలంగాణలో కొత్తగా 238 కరోనా కేసులు
కొత్తగా 238 కరోనా కేసులు
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో కరోనా కాటుకు ఇద్దరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలోమొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,740కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 1,551కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/