రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ దూరం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం హాజరుకావడం లేదు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్‌ పోకడలను నిరసిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరన సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా.. కాంగ్రెస్‌ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ భావ దారిద్య్రాన్ని నిరసిస్తున్నానని చెప్పారు.

ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. అమరుల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం వారి పేరు చెబుతూ రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజలు మరువరని అన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మరోపక్క ఈ వేడుకలకు సోనియా గాంధీ సైతం హాజరు కావడం లేదు. అనారోగ్యం రీత్యా హాజరుకావడం లేదని తెలుస్తుంది. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.