శోభానాయుడు మృతిపై జగన్‌, చంద్రబాబు, కెసిఆర్‌ సంతాపం

Kuchipudi Dance Shobha Naidu

అమరావతి: ప్రముఖ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. శోభానాయుడు మృతిపై సిఎం కెసిఆర్‌, జగన్‌ టిడిపి అధినేత చంద్రబాబు తమ సంతాపాన్ని ప్రకటించారు.

‘సత్యభామ, పద్మావతి పాత్రలను తన కూచిపూడి నృత్యం ద్వారా అద్భుతంగా పోషించారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని కెసిఆర్ ట్వీట్ చేశారు.

అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు తన అద్భుతమైన నాట్యంతో ప్రపంచాన్ని అలరించారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

భారతీయ కళల కీర్తిప్రతిష్టలను దేశవిదేశాల్లో తన నాట్య ప్రతిభతో శోభానాయుడు పెంచారని చంద్రబాబు అన్నారు. ఆమె వల్ల కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఇనుమడించాయని చెప్పారు. ఆమె సాధించిన అవార్డులు, రివార్డులే ఆమె కళా ప్రతిభకు తార్కాణాలని అన్నారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందని చెప్పారు. ఆమె కుటుబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/