బీసీ విద్యార్థుల‌కు తీపి కబురు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థుల‌కు తీపి కబురు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ తో పాటు స్టైఫండ్ విడుద‌ల చేయ‌డానికి ప్ర‌భుత్వం నిధుల‌ను కేటాయించింది. అతి త్వరలోనే విద్యార్థుల అకౌంట్ లలో ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ తో పాటు స్టైఫండ్ డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపారు. వీటి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 564.88 కోట్లు విడుద‌ల చేసింది.

గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల‌లో ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ కోసం రూ. 1300 కోట్ల ను తెలంగాణ ప్ర‌భుత్వ కేటాయించింది. అందులో భాగంగా ఈ రోజు నిధుల విడుద‌ల జీవో ను జారీ చేసింది. మొత్తానికి జీవో విడుదల కావడం తో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్ కేసీఆర్ లో మార్పు తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.