జాంజిబార్ పర్యాటక అంబాసిడర్ గా సంజయ్ దత్
చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. . ఈ బాలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు టాంజానియా దేశంలోని జాంజిబార్ సినీ రంగానికి పర్యాటక అంబాసిడర్ గా ఎంపికయ్యారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్నారు. ఆఫ్రికన్ దేశం టాంజానియా జాంజిబార్ లో పెట్టుబడులు- ఆరోగ్యం -విద్యా రంగానికి సహకరించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని సంజయ్ దత్ ప్రకటన చేశారు.
ఈమేరకు సంజయ్ టాంజానియా ప్రధానమంత్రిని కలుసుకున్నారు. ఆయనతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు, ‘గౌరవనీయమైన ప్రధాన మంత్రి @kassim_m_majaliwaని కలవడం నిజంగా గౌరవం. టాంజానియా చలనచిత్ర పరిశ్రమకు మద్దతు ఇవ్వగలిగినందుకు.. మీ అందమైన దేశ పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను! త్వరలో మళ్లీ సందర్శిస్తానని ఆశిస్తున్నాను!’ అని పేర్కొన్నారు.
తెలంగాణ వార్తలకు : https://www.vaartha.com/telangana/