కవితకు సొంత ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారు – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి vs టిఆర్ఎస్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ అరవింద్ కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత ఫై పలు ఆరోపణలు చేయడం..దానికి టిఆర్ఎస్ కార్య కర్తలు అరవింద్ ఇంటి ఫై దాడి చేయడం…కవిత సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరవింద్ ను నిజమాబాద్ సెంటర్ లో చెప్పుతో కొడతానని హెచ్చరించడం ఇవన్నీ కూడా చర్చ కు దారి తీశాయి. ఈ కారణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కవిత ఫై పలు ఆరోపణలు చేసారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో కవితకు ఆమె సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత గెలిస్తే తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే భావనతో ఆమెను ఓడించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీనే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేయిస్తే వారు బీజేపీలో ఎందుకు చేరుతారని ప్రశ్నించారు.