నేడు బీఆర్‌ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్‌

టి టీడీపీ కి రాజీనామా చేసిన చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌..ఈరోజు బిఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయవద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని ఆ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని టీడీపీ పార్టీ అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాసాని సుముఖంగా ఉండగా.. టీడీపీ అగ్ర నాయకత్వం మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు కాసాని. ముందు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి.. అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిన తర్వాత.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని అధిష్టానం నిర్ణయించడం కాసానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా అగ్ర నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీలో ఉండి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానానికి చెప్పినా.. వినకపోవడంతో కాసాని చివరకు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు అందగా.. కాసాని మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకొని, ఈరోజు కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతున్నారు.