టిక్ టాక్ లో పోస్టుకు స్పందించిన కర్ణాటక సీఎం
కిడ్నీ బాధితురాలికి సాయం
Bangalore: శాఖవ్వ అనే మహిళ రెండు కిడ్నీలూ పాడవడంతో ఆమె భర్త ఓ కిడ్నీని దానం ఇచ్చారు.
జనవరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
ఆపై ఆమె ఇంట్లో మెడిసిన్స్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది.
ఇదే సమయంలో గడచిన 20 రోజులుగా శేఖవ్వకు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది.
దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కుమార్తె పవిత్ర, తల్లి బాధను వివరిస్తూ టిక్ టాక్ వీడియో చేసింది.
ఈ సంఘటన కర్ణాటక బెళగావి జిత్తా నరసాపుర గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ వీడియో వైరల్ అయి కర్ణాటక సీఎం యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు నిన్న శాఖవ్వ ఇంటికి వెళ్లారు.
నెల రోజులకు సరిపడా మందులను అందించారు.
మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియజేయాలని సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/