ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదల హతం
జమ్మూకశ్మీర్లో చురుగ్గా సాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో కుల్గాం జిల్లాలోని నాగ్నాడ్ చిమ్మర్ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నాగ్నాడ్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్లో గాయపడిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించారు. న్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/