దళితులపై బండి సంజయ్ వివక్ష చూపుతున్నారంటూ బీజేపీ ఇన్‌చార్జ్ కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు

bandi-sanjay

తెలంగాణ బిజెపి లో రెండు వర్గాలుగా రాజకీయాలు మారబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. రీసెంట్ గా ఎంపీ అరవింద్ ..బండి సంజయ్ ఫై చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. బిజెపి లో బండి సంజయ్ – అరవింద్ వర్గాలుగా మారబోతున్నాయని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో బండి సంజయ్ ఫై ధర్మపురి బీజేపీ ఇన్‌చార్జ్ కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. దళితులకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి అంజయ్య వాళ్లకు పదవులు ఇస్తున్నారని.. బీసీ నాయకుడిగా ఉండి, దళితులకు పదవులు ఇవ్వరా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌పై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. బండి వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని అన్నారు. దళితులను కావాలని అణదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న మొన్న వచ్చిన వారు జాతీయ నాయకులవుతారా అంటూ ఆగ్రహించారు. ‘‘కడుపు మండి మాట్లాడుతున్నా.. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చావో తేల్చుకుందాం’’ అంటూ సవాల్ విసిరారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.