అధికారిక ప్రకటన : ప్రాజెక్ట్ కే లో కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే లో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే నుండి దిశా పటానీ ప్రీ లుక్ రిలీజ్ అయ్యింది. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పాన్ మూవీస్ చేసి మరింత ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు పాన్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ గత నెలలో విడుదల కాగా.. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు.

ఈ మూడు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె చాల ప్రత్యేకం. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి నటులు ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

గత కొద్దీ రోజులుగా ఈ మూవీ లో కమల్ హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండగా..వాటిని నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు. ఇప్పటికే మూవీ ఫై అంచనాలు తారాస్థాయి లో ఉండగా..ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కమల్ చేరడం తో మరింత ఆసక్తి పెరిగింది.

YouTube video