పార్టీలో చేరేందుకు దరఖాస్తుకు 25 వేలు చెల్లించాలి.. క‌మ‌ల్

పార్టీయేతర నేత‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

చెన్నై: సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌తో పాటు పార్టీల బ‌లాన్ని మ‌రింత పెంచుకోవ‌డానికి కీల‌క నేత‌లంతా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ష‌ర‌తు పెట్టారు. త‌మ‌ పార్టీ నుంచి పోటీ చేయాల‌నుకుంటోన్న‌ అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని, వారు దరఖాస్తు రుసుముగా రూ.25 వేలు చెల్లించాల‌ని పేర్కొన్నారు. పార్టీయేతర నేత‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. త‌మిళ‌నాడు పుదుచ్చేరిలో మేలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ‘మ‌క్క‌ల్ నీది మ‌య్యం’ బ్యాట‌రీ టార్చ్ సింబ‌ల్‌తో పోటీ చేయ‌నుంది.

త‌మిళ‌నాడులోని 234 నియోజ‌క వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, క‌మ‌లహాస‌న్ త‌న కాలుకు ఆప‌రేష‌న్ చేయించున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల నుంచి పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాలలో ఆయ‌న పాల్గొన‌నున్న‌ట్టు స‌మాచారం. ఆప‌రేష‌న్‌కు ముందు కూడా ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/