పవన్ ఫై కాకాణి కౌంటర్..10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేకపోయాడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధువారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను పరామర్శించారు. అలాగే రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

రైతులు పవన్ కల్యాణ్ కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేదని విమర్శించారు కాకాణి. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్ కు తెలియదని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్ పూట్ సబ్సిడీని ఎగనామం పెట్టారని, సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్లు బకాయిలు కలిపి సుమారు 5 వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రొటీన్ గానే కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు.