కళాతపస్వి కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత..

టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు కన్నుమూశారు. ఫిబ్రవరి 02 న కె. విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణం యావత్ చిత్రసీమ ను శోకసంద్రంలో పడేసింది. ఈ బాధ నుంచి కుటుంబ సభ్యులు , సినీ పరిశ్రమ తేరుకోకముందే ఆయన సతీమణి జయలక్ష్మి (86) గుండెపోటుతో కన్నుమూశారు.

రేపు సోమవారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్వనాథ్ చనిపోయిన సమయంలో ఆమె అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉన్నారు. చావులోనూ తమను ఎవరూ విడదీయలేరని ఒకే నెలలో దంపతులిద్దరూ పరమపదించారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్,