స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ – విజయవాడ సలహాదారు గా డాక్టర్ జయప్రకాశ్‌ సాయి

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Panchayati Raj Minister Peddireddy Ramachandra Reddy congratulating Dr. Jayaprakash Sai
Panchayati Raj Minister Peddireddy Ramachandra Reddy congratulating Dr. Jayaprakash Sai

Amaravati: స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌లో భాగంగా విజయవాడ అభివృ‌ద్ది కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ విజయవాడకు సలహాదారునిగా డాక్టర్ జె.జయప్రకాశ్‌ సాయిని ప్రభుత్వం నియమించింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతిపాదనను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకుంది. వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన రెండేళ్ల పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ విజయవాడకు సలహాదారుగా జయప్రకాశ్‌సాయి సేవలందించనున్నారు.
నీరు – పారిశుధ్యం కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కి ఆయన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా వివిధ శాఖలు, ఎన్‌జిఓలు, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌, మెడికల్ రంగాలల్లో డాక్టర్ జయప్రకాశ్ సాయికి విశేష అనుభవం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా , స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారుగా నియమించడం పట్ల జయప్రకాశ్‌సాయి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/