స్వీయనిర్బంధంలోకి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
రేపు కరోనా పరీక్షలు
న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, గొంతునొప్పి ఉండటంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్లోకి వెళ్లారు. కేజ్రీవాల్కు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా కేజ్రీవాల్తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. కేజ్రీవాల్ చాలా కాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమాకు మందులు వాడుతున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 28,936 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/