భార‌త ప్ర‌భుత్వంపై జ‌పాన్ కీలక ఆరోప‌ణ‌లు

భార‌త్ ద్వారా ఉక్రెయిన్‌కు స‌హాయం చేద్దామంటే భార‌త్ స‌హ‌క‌రించ‌లేదు..జ‌పాన్

టోక్యో: భార‌త ప్ర‌భుత్వంపై జ‌పాన్ కీలక ఆరోప‌ణ‌లు చేసింది. ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు మాన‌వీయ కోణంలో తాము స‌హాయం చేయాల‌ని భావించామ‌ని, అయితే.. త‌మ విమానాన్ని భార‌త్‌లో ల్యాండ్ చేస్తామంటే భార‌త ప్ర‌భుత్వం అందుకు అంగీకారం తెల‌పలేద‌న్న‌ది జ‌పాన్ అభియోగం. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని నిరాశ్ర‌యుల‌కు మాన‌వ‌తా కోణంలో తాము స‌హాయం అందించాల‌ని భావించామ‌ని, ఇందు కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ విమానాన్ని భార‌త్‌లో ల్యాండ్ చేద్దామ‌ని భావిస్తే, భార‌త్ అందుకు నో చెప్పింద‌ని జ‌పాన్ అధికార పార్టీ లిబ‌ర‌ల్ డెమోక్రెటిక్ ఆరోపించింది. రిపోర్టుల ప్ర‌కారం భార‌త్‌లో లోడ్ చేసుకొని, దానిని పోలాండ్‌, రోమానియా ద్వారా ఉక్రెయిన్‌కు స‌ర‌ఫ‌రా చేయాల‌ని త‌ల‌పోసింది. అయితే దీనిపై భార‌త విదేశాంగ శాఖ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌న్న‌ది జ‌పాన్ ఆరోప‌ణ‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/