అన్నవరంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

అన్నవరం నుంచి మొదలుకానున్నవారాహి యాత్ర

janasenani-pawan-kalyan-visited-satya-devadi-temple-in-annavaram

అన్నవరం : జనసేన పార్టీ తలపెట్టిన వారాహి యాత్ర ప్రారంభానికి ముందుగా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో పవన్ కల్యాణ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నవరం నుంచి భీమవరం ప్రయాణం మొదలుకానుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగనుంది.

అంతకుముందు మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ చీఫ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళవారం రాత్రికే వారాహి వాహనంతో పాటు పవన్ కల్యాణ్ అన్నవరం చేరుకున్నారు. కాగా, వారాహి యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 21న అమలాపురంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.