ఎన్టీఆర్ చైతన్య రథం మాదిరిగా పవన్ యాత్ర బస్సు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 05 నుండి బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబదించిన బస్సు ను సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సు చూస్తుంటే..సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ చైతన్య రథాన్ని చూసినట్లే అనిపిస్తుంది. ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేసారు. రెగ్యులర్ బస్‌లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఈ బస్సుకు ఉపయోగించారు. బస్సులో స్పెషల్‌గా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

పవన్ బస్సులో ఉంటే ఎంత దూరంలో ఉన్న వారికి అయినా కనిపించేలా బస్ టాప్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర జరిగినన్ని రోజులు పవన్ ఈ బస్సులోనే ఉండనున్నారు. ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్లుగా బస్సులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం వర్క్ షాపులో తయారు అవుతున్న ఈ బస్సు ఈ నెల 26 వరకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బస్సు తాలూకా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.