రేపు పాలమూరు జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో తెలంగాణ కు మాత్రమే సాధ్యమైందని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందు చూపుతో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారని, అన్ని పనులు ఒకేచోట పూర్తయ్యే అవకాశం లభిస్తుందని అధికారులు వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/