జనసేన పార్టీకి ఘోర పరాభవం

జనసేన పార్టీ కి తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. బిజెపి తో కలిసి 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన..కనీసం డిపాజిట్లు కూడా రాబట్టలేకపోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని స్వయంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ కనీసం పోటీలో నిల్వలేకపోయింది. అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.

ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది. ఇక బీజేపీ 88 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా ఆ పార్టీ అతిరథ మహారథులు ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అపజయం మూటగట్టుకున్నది. బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, ఈటల రాజేందర్‌ లు సైతం ఓటమి పాలయ్యారు.