గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఇప్పటంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు లక్ష రూపాయిల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన పవన్..రేపు వారికీ చెక్ లు అందజేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద జనసేన వర్గాలు ఆయనకు స్వాగతం పలికాయి.

పవన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి పయనమయ్యారు. ఇప్పటం గ్రామంలో ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా అధికారులు పలు కూల్చివేతలు చేపట్టారు. అయితే, జనసేన సభ ప్రాంగణానికి భూములు ఇచ్చిన కారణంగానే ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని జనసేన ఆరోపిస్తోంది. అందులో భాగంగానే కూల్చివేతలకు పాల్పడ్డారని మండిపడుతోంది.

YouTube video