జనసేన పార్టీ కోసం మధుప్రియ పాడిన పాట వైరల్ ..

రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు. మార్పు ఒక్కడితోనే మొదలు అన్నట్లు అంత తానై ముందుకు వెళ్తున్నాడు. ఓ పక్క సినిమాలు, మరో పక్క పార్టీ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం వారాహి రెండో దశ యాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏలూరు లో భారీ సభ నిర్వహించారు.

ఇదిలా ఉంటె జనసేన పార్టీ కోసం మధుప్రియ పాడిన ‘జాగోరే జాగో..కదిలిందిరా జనసేన’ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పాటను తెలంగాణలో ప్రముఖ ఫోక్ సింగర్స్ అయిన మధుప్రియ, నల్లగొండ గద్దర్ ఆలపించడం విశేషం. జనసేన పార్టీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటకు బుర్రా సతీష్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మొదటి నుంచి తెలంగాణ ప్రాంతమంటే అభిమానం కురిపించే పవన్ కళ్యాణ్.. ఈ సాంగ్‌ను సైతం ప్రత్యేకంగా ప్రముఖ తెలంగాణ సింగర్స్ మధు ప్రియ, నల్లగొంగ గద్దర్‌తో పల్లె గొంతుకతో పాడించారు. పవన్ కళ్యాణ్ సైతం తన జనసేన పార్టీ కోసం.. పాట చేయించుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

YouTube video