‘జగనన్న తోడు’ 28వ తేదీకి వాయిదా
మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ప్రభుత్వం నిర్ణయం

Amaravati: రాష్ట్రం లో ‘జగనన్న తోడు’ పథకం అమలను ప్రభుత్వం వాయిదా వేసింది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతి తో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఫిబ్రవరి 28 నుంచి జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది.
‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/