గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు

మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్

AP CM Jagan pays tribute to Gautam Reddy
AP CM Jagan pays tribute to Gautam Reddy

Potti Sriramulu Nellore District: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్ , అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయానికి చేర్చిన అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి రోడ్డు మార్గంలో రానున్నారు. అందుకు ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యవేక్షణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మేకపాటి అంతిమ సంస్కారాల పనుల్లో పాల్గొననున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/