తిరుపతి నుంచి నిహారిక పోటీ వార్తలపై వరుణ్ తేజ్ క్లారిటీ

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏ నేత ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు..? ఏ పార్టీ గెలవబోతుంది…? అంటూ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ తరుపున మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తిరుపతి నుండి పోటీ చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో మీడియా వారు నిహారిక పోటీ ఫై వరుణ్ తేజ్ ను అడుగగా..ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసారు.

వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమాతో మార్చి 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న వరుణ్.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్‌ పవన్ కల్యాణ్‌ ఏది చెప్తే అదే చేస్తామని అన్నారు. మా అవసరం ఉన్నది అనుకుంటే ఎన్నికల ప్రచారానికి వస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు.. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కల్యాణ్‌ వెంటే ఉంటామని పేర్కొన్నారు. అయితే, మేం పొలిటికల్‌గా ఏం చేయాలనుకున్నా పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని వివరణ ఇచ్చారు. ఇక, అనకాపల్లి నుండి నాన్న నాగబాబు పోటీ చేస్తే ప్రచారానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుండి నిహారిక పోటీ చేస్తుందంటూ జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ.. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.