రేపు విశాఖ కు సీఎం జగన్..పూర్తి షెడ్యూల్ ఇదే

ఏపీ సీఎం జగన్ ..రేపు విశాఖ లో పర్యటించనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను పార్టీ ప్రకటించింది. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో జగన్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుండి విశాఖకు బయలుదేరనున్న సీఎం.. సాయంత్రం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరణ, సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. అనంతరం రామ్‌ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనా ప్రారంభం , ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ శంకుస్ధాపన చేయనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని, రాత్రి 8.20 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.