నేడు కాకినాడ, రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కాకినాడ, రాజమండ్రిలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు. అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో ఆయన కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు.
మధ్యాహ్నం 3:50 గంటలకు హెలికాప్టర్లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్న జగన్.. స్థానిక నేతలతో మాట్లాడనున్నారు. తర్వాత 4.25 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మాధవి లత, ఎస్పీ సతీష్ పరిశీలించారు.