కోటంరెడ్డికి మరోసారి షాకిచ్చిన వైఎస్సార్సీపీ

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైయస్‌ఆర్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని వైస్సార్సీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.

కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సోదరుడు. ఈ మధ్యనే శ్రీధర్ రెడ్డి వైస్సార్సీపీ ఫై సంచలన ఆరోపణలు చేసి.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆరోపించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తోపాటు.. సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే.. శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా.. గిరిధర్ రెడ్డి కొనసాగుతారని.. ఆయనకే నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అలాంటిది అయన్ను సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.