అమిత్ షాతో ముగిసిన జగన్ సమావేశం

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించిన జగన్

jagan-meeting-with-amit-shah-ended

న్యూఢిల్లీః కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. 45 నిమిషాల పాటు కొనసాగిన వీరి భేటీ ఇప్పుడే ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రిని కలుస్తారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో జగన్ కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు స్వాగతం పలికారు.