ఏపీలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్

ఏపీలోని డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ మరో తీపి కబురు అందించారు. పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని బ్యాంకులను జగన్ సూచించగా..సీఎం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే SBI వడ్డీ తగ్గించగా..ఇప్పుడు SBI దారిలోనే కెనరా బ్యాంకు కూడా ముందుకు వచ్చింది.

పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలిపినట్లు కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇక సీఎం జగన్‌ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.