దేశ రాజధాని ఢిల్లీలో దారుణం..రెండు బస్సుల మధ్య తల చితికి యువతీ మృతి

దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. రెండు బస్సుల మధ్య తల చితికి యువతీ మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ ప్రతాప్‌ఘడ్‌కు చెందిన బాబ్లీ అనే యువతి(20) తన సోదరి, ఆమె భర్త వారి ముగ్గురు పిల్లలతో కలిసి లూథియానా వెళ్లేందుకు కశ్మీర్ గేటు వద్ద హర్యానా రోడ్ వేస్‌ సంస్థ బస్సు ఎక్కింది.

కాగా, అలీపూర్ ప్రాంతానికి రాగానే ఆమెకు వాంతి రావడంతో కిటికీలోంచి తల బయటపెట్టింది. అదే సమయంలో మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండటంతో రెండు బస్సుల మధ్య ఆమె తల నలిగి దుర్మరణం చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం పోలీసులు రెండో బస్సు కోసం గాలిస్తున్నారు.