ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ ..

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు ఇచ్చేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా, ఆథర్, హీరో, బిగాస్, కైనెటిక్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) వంటివి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తాయి.

ఉద్యోగులకు ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను నెడ్‌క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.