ర‌ఘురామ పిటిష‌న్‌ను కొట్టివేయాలి..జగన్

బెయిల్ షరతులను ఉల్లంఘించ‌లేదు: సీబీఐ కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేసిన జ‌గ‌న్

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిష‌న్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ తో పాటు సీబీఐని గతంలో కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు గ‌డువు కోరిన‌ జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసి త‌మ అభిప్రాయాలు తెలిపారు. తాను బెయిల్ ష‌ర‌తుల‌ను ఉల్లంఘించ‌లేద‌ని జ‌గ‌న్ చెప్పారు. ర‌ఘురామ పిటిష‌న్‌కు అర్హ‌త లేద‌ని కౌంట‌ర్‌లో ఆయ‌న పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం న్యాయ వ్య‌వ‌స్థ‌ను వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ర‌ఘురామ పిటిష‌న్‌ను కొట్టివేయాల‌ని కోరారు. అనంతరం తదుపరి విచారణను సిబిఐ నాయ్యస్థానం ఈ నెల14వ తేదీకి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/