రాజమండ్రి కో ఆర్డినేటర్ ను నియమించిన జగన్

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ పార్టీ కి చెక్ పెడుతూ అభ్యర్థులను నియమిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే భవాని ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ ను ప్రకటించారు. రాజమండ్రి నియోజవకర్గ కో ఆర్డినేటర్ గా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు వైద్యుడిగా మంచి పేరుంది. విజయభారతి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి రాధిక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు మంత్రిగా ఉన్న సమయంలో గూడూరి శ్రీనివాస్ నగర పాలక సంస్థ కార్పోరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు.